పట్టా ఇప్పించాలని వినతి

కరీంనగర్‌ జూలై 16 (జనంసాక్షి) : రామడుగు మండలంలోని షానగర్‌కు చెందిన వితంతువు జోగు బుజ్జమ్మ తన భూమికి పట్టా ఇప్పించాలని సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చింది. గతంలో మంత్రుల ఆదేశాలతో తనకు ఎకరం భూమి, ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేసిన అధికారులు, పట్టా ఇవ్వలేదని వినతపత్రం ఆమె పేర్కొంది.