పట్టుపరిశ్రమ ఉద్యగుల సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామరాజు

హైదరాబాద్‌ : రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ పుల్‌ టైం కంటిన్‌గెంట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఎం.వెంకట్రామరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా వి. నారాయణ, కోశాధికారిగా  కె. రమేష్‌ బాబు నియామితులయ్యారు. అనంతరం సచివాలయంలో వెంకట్రామరాజు మాట్లాడుతూ 30 ఏళ్లుగా  కంటిన్‌గెంట్‌ ఉద్యోగులుగా పని చేస్తున్న 1500 మందిని క్రమబద్దీకరించాలని డిమాండ్‌ చేశారు. నూతన కమీటి ప్రభుత్వం గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.