పత్తికి కనీస మద్దతు ధర 6వేలు చెల్లించాలని రైతుల పాదయాత్ర

తలమడుగు: మండలంలోని సజ్జల గ్రామంలో సోమవారం రైతులు పాదయాత్ర చేపట్టారు. రైతులు పండించిన పత్తికి కనీస ధర రూ.6వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో 30కీ.మీ. పాదయాత్ర చేపట్టారు. రైతులకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న పాదయాత్రలో పాల్గొన్నారు.