పది డిమాండ్లపై ప్రతిష్టంభన: ఎన్‌ఎంయూ

హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల పది డిమాండ్లపై ప్రతిష్టంభన కొనసాగుతుందని ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ తెలిపారు. ఆర్టీసీ యాజమాన్యం, ఎన్‌ఎంయూ మధ్య నాలుగో దఫా చర్చలు ముగిశయి. చర్చలు ముగిసిన అనంతరం ఎన్‌ఎంయూ నేత మహమూద్‌ మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీలోని ఒప్పంద కండక్టర్లు, డ్రైవర్ల సర్వీస్‌ క్రమబద్దీకరణపై ఎలాంటి హమీ రాలేదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌తో తుది దఫా చర్చలు జరుపుతామని పేర్కొన్నారు. రేపటి చర్చల తర్వాత సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.