మెట్టుగూడ మార్గంలో రైళ్ల రాకపోకల్లో మార్పు

హైదరాబాద్‌: మెట్టుగూడ వద్ద బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ఈ నెల 7 నుంచి 9 వరకూ ఆ మార్గంలో పలు రైళ్ల రాక పోకల్లో మార్పులు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. రాజధాని నుంచి మేడ్చల్‌, మీర్జాపల్లి,బొల్లారం, భువనగిరి, మనోహరబాద్‌ వైపు వెళ్లే 18 సబర్బన్‌ రైళ్లను రద్దు చేశారు. మెట్టుగూడ మీదుగా వెళ్లే 8రైళ్లను సికింద్రాబాద్‌ మీదుగా మళ్లించనున్నారు, మరో మూడు రైళ్ల సమయాల్లో మార్పులు చేయగా 12 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు.