రేవంత్ రెడ్డి విజయకేతనం కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు

మద్దూరు డిసెంబర్ 4 జనం సాక్షి

కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. కొడంగల్ నియోజకవర్గం నుండి రేవంత్ రెడ్డి 32532 అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యంలో మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మద్దూర్ పాత బస్టాండ్ చౌరస్తాలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గణప శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి దొరల పాలన నుంచి విముక్తి లభించిందని, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మహాదేవ్, చికిని పురుషోత్తం, మహిముద్, ముద్ది శ్రీను, కృష్ణ, సూరిబాబు, చికిని మహేష్, మనోహర్, అంబటి జములప్ప, బైరం కనకప్ప, డిల్లీ కర్ ప్రవీణ్ కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రేవంత్ రెడ్డి అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు