లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్‌స

కలిగిరి: నెల్లూరు జిల్లా కలిగిరి తహశీల్దార్‌ కార్యాలయంలో సర్వేయర్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సర్వేయర్‌గా పనిచేస్తున్న నాగరాజు వ్యవసాయ భూమి సర్వే చేసేందుకు నోటి నర్సారెడ్డి అనే రైతు నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు సర్వేయర్‌ను పట్టుకున్నట్లు ఏసీబీ  అధికారులు తెలిపారు.