వరంగల్‌ డీసీసీబీ అధ్యక్ష ఎన్నికపై సీఎంతో నేతల చర్చ

హైదరాబాద్‌: వరంగల్‌ డీసీసీబీ అధ్యక్ష ఎన్నికపై ఉత్కంఠ  కొనసాగుతోంది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గండ్ర భేటీ అయ్యారు. వరంగల్‌ డీసీసీబీ ఛైర్మన్‌ ఎన్నికపై సీఎంతో చర్చించారు. దొంతి మాధవరెడ్డిపై పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు 8 మంది డైరెక్టర్లతో నామినేషన్‌ వేయడానికి జంగా రాఘవరెడ్డి బయలుదేరారు.