శ్రీవారి సేవలో నాగార్జున
తిరుమల: హీరో నాగార్జున ఈరోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తను నటించిన ‘శిరిడిసాయి’ చిత్రం ఘనవిజయం సాధించడం అనందంగా ఉందన్నారు. ఈ చిత్రం ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేస్తానన్నారు.