హైదరాబాద్ లో ఏటీఎం సేవలకు అంతరాయం
హైదరాబాద్: నగరంలోని అనేక బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో నగదు వుంచే సీఎంఎస్ సంస్థ లాకౌట్ ప్రకటించడంతో అనేక ఏటీఎంలు తాత్కాలికంగా పనిచేయడం లేదు. సంస్థలాకౌట్తో జంటనగరాల్లో దాదాపు 1500 ఏటీఎం సేవలు నిలిచిపోయినట్లు సమాచారం. ఏటీఎంలు పనిచేయకపోవడంతో వినియోగాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.