అంగరంగ వైభవంగా ములుగు జిల్లా జెడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ జన్మదిన వేడుకలు..

వెంకటాపూర్(రామప్ప),ఆగస్ట్20(జనం సాక్షి):-
శనివారం రోజున ములుగు జిల్లా జెడ్పి చైర్మన్ జిల్లా అధ్యక్షులు మరియు నియోజకవర్గ ఇన్చార్జ్ కుసుమ జగదీష్ పుట్టినరోజు సందర్భంగా వెంకటాపూర్ మండలం తాళ్లపాడు సెంటర్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం వెంకటాపూర్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి మాట్లాడుతూ ములుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకు అందిస్తూ ములుగు జిల్లాను సస్యశ్యామలం చేస్తున్నారని కొనియాడారు.నాయకులు అందరూ జననేతలు కాలేరు కొంతమంది మాత్రమే జనం గుండెల్లో స్థానం సంపాదించుకుంటారు అలాంటివారు చరిత్ర సృష్టిస్తారు చరిత్రను తిరగ రాస్తారు అలాంటి హిస్టారికల్ లీడర్ మన జగదీష్ అన్న అని జగదీష్ అన్న నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భవిష్యత్తులో ఇంకెన్నో పెద్ద పదవులు పొందాలని వారి కుటుంబ సభ్యులు వారు సుఖ సంతోషాలతో ఉండాలని వారికి వెంకటాపురం మండలం పార్టీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నానని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మెడబోయిన అశోక్, నల్లగుంట సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి, నారాయణపూర్ సర్పంచ్ మేకల మహేందర్, వెలుతుర్లపల్లి సర్పంచ్ జగన్ మోహన్ రావు, వెంకటాపూర్ సుసేటి చైర్మన్ కాసర్ల కుమారస్వామి, వెంకటాపూర్ మండలం కో ఆప్షన్ సభ్యులు జహీర్ భాష, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ తండా రమేష్, వెంకటాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు నర్ర బద్రన్న, లింగాపూర్ గ్రామ అధ్యక్షులు చిక్కుల కళ్యాణ్, వెంకటాపురం మాజీ సర్పంచ్ సాదా యాదగిరి,ఎస్సీ సెల్ జిల్లా ములుగు అధ్యక్షులు రామిండ్ల రాజేందర్, నల్లకుంట మాజీ ఎంపీటీసీ జనగాం రవీందర్,జాగృతి జిల్లా నాయకులు అంతటి రాము, లక్ష్మీదేవి పేట రైతుబంధు గ్రామ కమిటీ అధ్యక్షులు వీరగాని సాంబయ్య, ములుగు జిల్లా యువజన నాయకులు చీకుర్తి మధు యాదవ్, మైనారిటీ మండల అధ్యక్షులు మొలుగూరి మహేందర్, రామంజపూర్ వార్డు సభ్యులు అనిల్ ములుగు జిల్లా మైనార్టీ సీనియర్ నాయకులు అలీ మియా,టిఆర్ఎస్ నాయకులు బోడ రాములు, బాల్న శ్రీనివాస్, ప్రముఖులు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.