అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ నరసింహ యాదవ్

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ నరసింహ యాదవ్

సికింద్రాబాద్ ఆర్.సి సెప్టెంబర్ 23 (జనం సాక్షి ) నిరంతరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన పల్లి 119 డివిజన్ లో నేడు 61లక్షల తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ పనులకు కూకట్ పల్లి జనహృదయనేతలు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ చేతుల మీదగా నేడు అభివృద్ధి పనులు స్వర్ణధామ నగర్ లో29 లక్షలు, రామరాజు నగర్ కాలనీలో18 లక్షలు, అంజయ్య నగర్ కల్లు కాంపౌండ్ లైనులో14 లక్షలు తో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ తేజ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నరేందర్ గౌడ్,మక్కల నర్సింగ్ రావు, కర్రి జంగయ్య, సయ్యద్, అజాజ్,ఇర్ఫాన్, డివిజన్ సెక్రెటరీ మేకల హరినాథ, వేణుగోపాల్ రెడ్డి,మట్టి శ్రీనివాస్, బుర్రియాదగిరి, జహంగీర్,ఖదీర్, కృష్ణారెడ్డి, సరోజ, సంతోషి,దేవి, వాణి,లలిత శ్రీనివాస్ రెడ్డి, కనకరాజు,అశోక్,బాల్ రాజ్, కార్మిక యువ నాయకుడుసిహెచ్.పోచయ్య,నేతరికుమార్,గణేష్, పిట్ల రాజు,జె కె, బాబా,దుబాయ్ మల్లేష్,ఐలేష్, ఉదయ్, సంపత్ పార్టీ కార్యకర్తలు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.