అంధుల ఆశ్రమం పాఠశాలలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

గద్వాల నడిగడ్డ ఆగస్టు 19 (జనంసాక్షి)గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని రాఘవేంద్ర కాలనీ లోని శుక్రవారం అంధుల ఆశ్రమ పాఠశాలలో ఫోటోగ్రాఫర్ ఎస్ ఎస్ శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికిముఖ్యఅతిథిగా గద్వాల్ టౌన్ ఎస్సై హరిప్రసాద్ రెడ్డి హాజరయ్యారు.
ఎస్సై హరిప్రసాద్ కిఫోటోగ్రాఫర్లు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
అనంతరం ఎస్సై హరి ప్రసాద్ రెడ్డి తో పాటు ఫోటోగ్రాఫర్లు మిత్రులు చిన్నారుల చేతుల మీదుగా కేక్ కటింగ్ నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు.పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఎస్సై చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరికీ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు
ప్రస్తుతం యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా సేవా దృక్పథంతో మంచి నడకలు క్రమశిక్షణతో కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు ఒకరికి సహాయం చేసే సహృదయం కలిగి ఉండాలని పేర్కొన్నారు.
మీరు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో గద్వాల ఫోటోగ్రాఫర్స్ వేణు,రమేష్ బాబు, కృష్ణ,చంటి,వంశీ,రాజు శివ, పాఠశాల ప్రిన్సిపాల్ రంగన్న తదితరులు పాల్గొన్నారు.