అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అడ్మిషన్ కు గడువు పెంపు

నర్సాపూర్. అక్టోబర్,  18, ( జనం సాక్షి ) :
  డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ) కోర్సుల్లో చేరడానికి చివరి తేది అక్టోబర్ 30, 2022 వరకు  గడువు పొడిగించినట్లు  ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా  దామోదర్,  కో ఆర్డినేటర్ నరేందర్ లు  తెలిపారు. మంగళవారం నాడు వారు మాట్లాడుతూ  ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను www.braouonline.in లో పొందుపర్చినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియెట్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్ పూర్తి చేసిన వారు , పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులలో 2022 వరకు పాసైన విద్యార్థులు  నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చని సూచించారు. తెలుగు , ఇంగ్లీష్ మీడియం లలో చదవవచ్చునని, ఇంటర్ తత్సమాన అర్హత కలిగిన వారు  ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  అలాగే ద్వితీయ , తృతీయ సంవత్సర విద్యార్థులు కోర్సు ఫీజు  ఈ నెలాఖరు 30 వతేదీ లోపు చెల్లించుకోవచ్చునని   తెలిపారు. మరిన్ని వివరాలకు 7382929736 ఫోన్ నంబర్ ను  సంప్రదించాలని కోరారు.