అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

అంబేద్కర్ యూత్ మండల అధ్యక్షుడు దుర్గం మల్లేష్ నేత.
నెన్నెల, నవంబర్ 1, (జనంసాక్షి)
జోగులంబా గద్వాల జిల్లా ధరూర్ మండలం రేవుల పల్లి గ్రామంలో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని, విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు దుర్గం మల్లేష్ నేత డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే సాక్షాత్తు రాజ్యాంగాన్ని అవమాన పరిచినట్టు అని, రాజ్యాంగాన్ని అవమాన పరిచిన ద్రోహులకు దేశంలో నివసించే హక్కు లేదని అన్నారు. పోలీసులు వెంటనే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని లేనట్లయితే ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.