అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ప్రకాశం: క్వారీల నుంచి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం ఉదయం పట్టుకున్నారు. వాహనాలను రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. యజమానులకు జరిమానా విధించనున్నట్లు ఉప తహసిల్దార్‌ ప్రభాకర్‌ తెలియజేశారు. ఈ దాడుల్లో ఎస్సై రాజేశ్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.