అగ్ని-3 క్షిపణి విజయవంతం

1
భువనేశ్వర్‌,ఏప్రిల్‌16(జనంసాక్షి): భారత అమ్ముల పొదిలో మరో అణ్వస్త్రం చేరింది. సుదూర లక్ష్యాలను ఛేదించగల అగ్ని-3 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలో గురువారం ఉదయం నిర్వహించిన అగ్ని-3 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న అగ్ని-3 క్షిపణి… 3,500 కి.విూ పరిధిలోని లక్ష్యాలను  ఛేదించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో సుదూర ప్రాంతాల లక్ష్యాలను ఇది ఛేదించగలదని భావిస్తున్నారు.