అత్యుత్సాహమే ప్రాణం తీసింది..

అత్యుత్సాహమే ప్రాణం తీసింది..

న్యూఢిల్లీ:   ఇద్దరు టీనేజ్  పిల్లల అత్యుత్సాహం ఒకరి ప్రాణాలు తీసిన ఘటన దక్షిణ ఢిల్లీలోని వసంత విహార్  ఏరియాలో చోటు చేసుకుంది.  తన స్నేహితురాలిని  సరదాగా అలా  బైటికి తీసుకెళ్లాలనుకున్న ఓ టీనేజ్ కుర్రాడు  ఇంటిలోంచి కారును  దొంగతనంగా తీసుకొచ్చాడు. కానీ కారును అదుపు  చేయడంలో విఫలమై ఒక చెట్టును ఢీ  కొట్టాడు.  దీంతో 16 సం.రాల అమ్మాయి అక్కడిక్కడే చనిపోయింది. దీంతో ఇరు కుటుంబాలు  విషాదంలో మునిగిపోయాయి. ఆ కుర్రాడు  తీవ్ర గాయాలతో ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఇద్దరు  ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు.

కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు  మొదలు పెట్టారు.