అదనపు విద్యుత్‌ కేటాయించండి

న్యూఢిల్లీ: రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్‌ కొరత నెలకొన్నందున అదనపు విద్యుత్‌ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాధ్యూ విజ్ఞప్తి చేశారు. కేంద్రవిద్యుత్‌శాఖ కార్యదర్శితో ఆమె సమావేశమయ్యారు. సింహద్రి నాలుగో యూనిట్‌కు కావాల్సిన బొగ్గు సరఫరాను త్వరగా చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు.