అధికారులు సమన్వయంతో ఉండాలి

ఖమ్మం,మార్చి02(జ‌నంసాక్షి):మండల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు సూచించారు.  దమ్మపేట  స్థానిక మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం సోమవారం ఎంపీపీ అల్లం వెంకమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే సవిూక్షలో పాల్గొని అధికారులకు సూచనలు, సలహాలు అందించారు. దమ్మపేటలో జూనియర్‌ కళాశాల ఏర్పాటుచేయాలని ఎమ్మెల్యే సమక్షంలో మండల పరిషత్‌ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో జడ్పీటీసీ సరోజిని, ఎండీవో పద్మ, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.