అనాధ బాలుర ఆశ్రమంలో వస్త్ర,పండ్ల, అన్నదాన పంపిణీ.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్11(జనంసాక్షి):
నాగర్ కర్నూల్ మండలంలోని చందబట్ల గ్రామానికి చెందిన కొండ కింది రాజేందర్ రెడ్డి జ్ఞాపకార్థం అతని భార్య సునిత రెడ్డి కొల్లాపూర్ చౌరస్తాలోని శ్రీ జ్ఞానేశ్వర బాలుర కళ్యాణ ఆశ్రమంలో నివసిస్తున్న బాలల అందరికీ ఆదివారం నాడు పండ్ల పంపిణీ నిర్వహించారు.భర్త జ్ఞాపకార్థం అనాధ బాలురకు వస్త్రాలు ,పండ్లు, ఒకరోజు అన్నప్రసాద పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పద్మమ్మ, వెంకటరెడ్డి ,లోకేశ్వరి, ఆశ్రమ కమిటీ సభ్యులు దొడ్ల ఇందుమతి, ఎద్దుల మాధవి,భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
2 Attachments • Scanned by Gmail