అనారోగ్యంతో బాధ పడుతున్న గీత కార్మికుడికి చేయూత…

కేసముద్రం సెప్టెంబర్ 18 జనం సాక్షి / బోన్ క్యాన్సర్ తో కుడి చేయిని కోల్పోయి శాశ్వత అంగ వైకల్యానికి గురై తాడి చెట్లు ఎక్కలేని పరిస్థితి  మండలంలోని తాళ్ల పూసపల్లి గ్రామానికి చెందిన గుజ మల్లయ్య  గౌడ్ అనే గీత కార్మికుడికి ఏర్పడింది.ఇతడికి భార్య సుజాత,ఇద్దరు కుమారులు శ్యామ్,గణేష్ లు ఉన్నారు.తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబం గడువలేక కుమారులిద్దరు చదువు మానేసి ఒకరు మెకానిక్ షాప్ లో,మరొకరు కిరాణం షాప్ లో రోజు వారీ కూలీల కు వెళ్తున్నారు.ఈ సంఘటపై పూర్తి విచారం వ్యక్తం చేస్తూ ఆ గ్రామ కౌండిన్య గౌడ యువకులు,గౌడ(గోపా) జిల్లా నాయకులు చిలువేరు సమ్మయ్య గౌడ్,సమ్మెట వెంకన్న గౌడ్ సమక్షంలో మల్లయ్య గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం 26500 రూపాయల నగదు,50 కిలోల బియ్యం,రెండు నెలలకు సరిపడా వంట సామాను అందజేయడం జరిగింది.అదే విదంగా మల్లయ్య కుటుంబ పరిస్థితి జిల్లా నాయకులు సమ్మయ్య గౌడ్ దృష్టి కి తీసుకురాగా వారి చిన్న కుమారుడు గణేష్  కుటుంబ పరిస్థితులు వల్ల చదువు ఆపేస్తే అతని చదువుకయ్యే ఖర్చు భరిస్తానని ,చదువు కొనగించేలా పూర్తి సహకరమిస్తానని,మండల,జిల్లా నాయకుల తో చర్చించి కుంటుంబానికి భవిష్యత్తు లో అండగా ఉండేలా గౌడ సంఘం తరుపున చూస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో గౌడ యువ నాయకులు
నరేటి హరీష్,వళ్ళలా రాజేందర్ ,వంగ సురేందర్ ,మెంచు వంశీ ,వంగ సంపత్ ,నరిటి సాయి ,నారేటి వేణు,మోగులగాని అశోక్ ,వేముల యాకన్న ,వంగ యాకన్న,శీలం యాకన్న,శీలం రాములు,మాద శ్రీనివాస్, సమ్మెతి వెంకన్న,వళ్ళల శ్రావణ్ ,గండు పరమేష్ ,దోమల విజయ్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సహాయం చేసిన గౌడ బాంధవులకు  ధన్యవాదాలు తెలిపారు.