అనుకూలంగా రాకపోతే కార్యాచరణ తీవ్రంగా ఉంటుంది : కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే తీవ్రమైన తాము రూపొందించే కార్యాచరణ ఉంటుందని తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం అన్నారు. అఖిపలక్ష సమావేశంలో తెలంగాణపై స్పష్టమైన అభిప్రాయం చెప్పాలంటూ తెలంగాణ ఐకాస పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కలిసింది. ఐకాస ఛైర్మన్‌ కోదండరాం సహా ఇతర నేతలు ఈ ఉదయం గాంధీభవన్‌లో బొత్సతో భేటీ  అయ్యారు. అధికార పార్టీగా పెద్దన్న పాత్ర షోషించాలని తెలంగాణపై స్పష్టమైన అభిప్రాయం చెప్పాలని వారు  కోరారు. బొత్స ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదన్న ఐకాస నేతలు.. తమ విజ్ఞప్తిని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పినట్లు నేలు చెప్పారు.