అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్..

అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్

 భువనగిరి టౌన్ (జనం సాక్షి:–
భువనగిరి పట్టణ 23వ వార్డు ఇందిరానగర్ అరుంధతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించగా స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ పాల్గొని గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈసందర్భంగా మాట్లాడుతూ గత 40 సంవత్సరాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు కుల మతాలకతీతంగా భక్తిశ్రద్ధలతో విశిష్ట పూజలు మరియు సంస్కృతి కార్యక్రమాలు భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ పట్టణంలోనే ప్రత్యేకతగా అరుంధతి యూత్ గణేష్ నవరాత్రిల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు పట్టణ ప్రజలు గణేష్ నిమజ్జన శోభయాత్ర శాంతి యుతంగా నిర్వహించాలని అన్నారు. ఈకార్యక్రమంలో యూత్ అధ్యక్షులు గొపే బాబు కోశాధికారి బర్రె నరేందర్ ప్రధాన కార్యదర్శి దర్గాయి గణేష్ సభ్యులు కరకాల సుదర్శన్ కొల్లూరు రాజు ఈశ్వర్ బాబు నర్సింగరావు సంపత్ మల్లేష్ కిరణ్ మహేష్ తరుణ్ రాము రాజు నవీన్ భరత్ తదితరులు పాల్గొన్నారు.