అన్నా బృందానికి అనుమతి

ఢిల్లీ: జంతర్‌మంతర్‌ వద్ద నిరవధిక నిరశన దీక్ష చేపట్టడానికి ఎట్ల కేలకు అన్నాబృందానికి ఢిల్లీ పోలీసులు అనుమతి లభించింది రెండు రోజుల క్రితం అనుమతి నిరాకరించిన పోలీసులు జులై 25 నుంచి ఆగష్టు 8 మధ్య అనుమతినిస్తూ ఈ రోజు అంగీకారం తెలిపారు. రోజుకు వెయ్యి మంది ఆందోళన కారులు, 5వేల మంది ప్రజలకన్నా ఎక్కువ మంది ఆ ప్రదేశానికి రాకేడదని బృంద సభ్యుడు నీరజ్‌ పాండే ఆ మేరకు హామీ ఇచ్చారని, అందుకే అనుమతినిస్తున్నామని పోలీసులు తెలిపారు.అవినీతిని అరికట్టడంలో, బలమైన లోక్‌పాల్‌ బిల్లు తేవడంతో విఫలమైన యూపీఏ ప్రభుత్వనికి వ్యతిరేకంగా అనా బృందం జులై 25నుంచి నిరవధిక నిరశనగా దీక్ష చేపట్టనున్న ట్లు ప్రకటించారు.