అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగాలి

మల్దకల్ ఆగస్టు 23 (జనంసాక్షి) మండల ప్రజా పరిషత్ మల్దకల్ కార్యాలయం లో మంగళవారం కొత్తగా ఏర్పడినటువంటి నైస్ సాఫ్ట్వేర్ పై ఫీల్డ్ అసిస్టెంట్లకు ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లకు వారాంతపు సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో డెంగ్యూ కేసులు ప్రబలుతున్న తరుణంలో అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా ప్రతిరోజు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అందరూ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఏపీఓ స్వామి,టెక్నికల్ అసిస్టెంట్లు, ఇబ్రహీం,నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు హాజరయ్యారు.