అన్ని మండలా లకు ప్రత్యేక నిధులు

శివ్వంపేట సెప్టెంబర్ 22 జనంసాక్షి : త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎంపీపీల సమక్షంలో ప్రత్యేక సమావేశ నిర్వహించి అన్ని మండల పరిషత్ లకు ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని రాష్ట్ర  మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. జిల్లాలో వెనుకబడిన మండలాలను గుర్తించి వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వఫరంగా నిధులు కేటాయించాలని జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జిల్లా పరిషత్ చైర్మన్ ర్యాకల హేమలత శేఖర్ గౌడ్, జిల్లాలోని వివిధ మండల చెందిన ఎంపీపీ లతో కలిసి ఎంపీపీ గురువారం మర్యాదపూర్వకంగా మంత్రి హరీష్ రావు ను కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా ఏర్పాటు అయినా మండలాలకు 5  అయిదు లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా పాత మండల పరిషత్ లకు కూడా మరో ఐదు లక్షల చొప్పున  నిధులు ఇప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు హరికృష్ణ తెలిపారు.