అఫ్ఘాన్‌లో ముష్కరుల ఘాతుకం

తాలిబన్ల దాడిలో 15మంది మృతి

కాబుల్‌,జూన్‌11(జ‌నం సాక్షి): అఫ్గానిస్థాన్‌లో ముష్కరులు మరోసారి పేట్రేగిపోయారు. కుందుజ్‌ ప్రాంతంలో తాలిబన్ల దాడిలో 15 మంది అప్గాన్‌ భద్రతా సిబ్బంది మృతి చెందారు. కాందాహర్‌ ప్రావిన్స్‌లోని అర్గాన్దాద్‌ జిల్లాలోని ఓ చెక్‌పాయింట్‌ వద్ద ఈ దాడి చోటుచేసుకుంది. రంజాన్‌ సందర్భంగా మూడు రోజుల కాల్పుల విరమణను అంగీకరించిన తాలిబన్లు ఈ దాడికి పాల్పడటం గమనార్హం. ఈ దాడికి తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించుకున్నారు. రంజాన్‌ నేపథ్యంలో మూడు రోజుల కాల్పుల విరమణను తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. తమపై దాడులకు దిగితే తిప్పి కొడతామని.. అలాగే విదేశీ బలగాల లక్ష్యంగా దాడులను కొనసాగిస్తామని శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.