అబద్ధాల పునాదులపై.. 

తెదేపా ప్రభుత్వం పనిచేస్తుంది
బుగ్గన అమిత్‌షా, రామ్‌మాధవ్‌ను కలిశాడనటంలో వాస్తవంలేదు
అది నిజమని నిరూపిస్తే దేనికైనా సిద్ధమే
ఏపీ భవన్‌ ప్రభుత్వ అతిధిగృహం.. ఎవరైనా రావచ్చు
విలేకరుల సమావేశంలో భాజపా ఎమ్మెల్సీ ఆకుల సత్యనారాయణ
న్యూఢిల్లీ, జూన్‌15(జ‌నం సాక్షి ) : అబద్ధాల పునాదుల విూద తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తోందని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆరోపించారు. ఆయన శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ.. తాను అమిత్‌షాతో వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్‌ను కలిపానన్న ఆరోపణలను నిరూపిస్తే దేనికైనా సిద్దమన్నారు. ఈ క్రమంలో మంత్రులు అచ్చెనాయుడు, అమర్నాథ్‌ రెడ్డి, లోకేశ్‌, చంద్రబాబు నాయుడులకు ఆయన సవాల్‌ విసిరారు. టీడీపీ నాయకులు తనపై విూద చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ఏపీ భవన్‌ ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌ ఎవరైనా రావచ్చు.. దానికి రాజకీయాలను అపాదించడం సరికాదన్నారు. ఇప్పుడు కుట్ర రాజకీయలు ఎవరు చేస్తున్నారో ప్రజలకు అర్థం అవుతుందని తెలిపారు. తనని బుగ్గన రాజేంద్రనాథ్‌ కలిసిన మాట వాస్తవమని, ఇద్దరం కలిసి శాంగ్రీల ¬టల్‌లో కలసి భోజనం చేసిన మాట నిజమేనన్నారు. అయితే ఇందులో రహస్య సమావేశం ఎక్కడ ఉందో లోకేష్‌ వివరణ ఇవ్వాలన్నారు. టీడీపీ కుటిల రాజకీయాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తోందన్నారు. మల్టీ నేషనల్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ని రాష్ట్ర ప్రయోజనాల కోసం అడిగామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన ఇస్తారని.. ఏపీ ప్రజలు ఎన్నుకున్నారు.. కానీ దానికి విరుద్ధంగా టీడీపీ పనిచేస్తుందని విమర్శించారు. స్పీకర్‌ వ్యవస్థను టీడీపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీ స్థాయిలో తాను ఎవరిని కలవలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా గురువారం మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్నాథ్‌ రెడ్డిలు ఓ వీడియోను విూడియాకు విడుదల చేశారు. వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కలిసి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా, రామ్‌ మాధవ్‌లను కలిశారని ఆరోపించారు. వైసీపీతో కుమ్మకై బీజేపీ ధైర్యంగా ఏపీపై కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీకి వైసీపీ సిస్టర్‌ పార్టీ అంటూ ఆరోపించారు. అటు టీడీపీ నేతల నుంచి విమర్శలు రావడంతో.. ఆకుల సత్యనారాయణ స్పందించారు. మంత్రుల వ్యాఖ్యలు అవాస్తవమని పేర్కొన్నాడు.