అమరవాయి పాఠశాలలో వైద్య శిబిరం

మల్దకల్ అక్టోబర్ 21(జనంసాక్షి)జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆర్ బిఎస్ కేప్రోగ్రాంలో భాగంగా శుక్రవారం వైద్య బృందం అమరవాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.అన్ని తరగతుల విద్యార్థులకు పరీక్షించి కావలసిన మందులు ఇవ్వడం జరిగింది.రక్తహీనత, దంత సమస్యలు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి జిల్లా ఆసుపత్రికి మతకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి,రెఫర్ చేశారు. పదవతరగతి విద్యార్థులకు టిడి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగినది చేతిపరిశుభ్రత,పోషకాహార విలువలు గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్,డాక్టర్ నిఖిల ,ఏఎన్ఎం ఊర్మిళ,ఫార్మసిస్ట్ పరశురాం,ఆశా కార్యకర్తలు, ప్రధానోపాధ్యాయురాలు జానకమ్మ, ఉపాధ్యాయులు సుమలత,శోభారాణి,నాగరాణి,ప్రసన్న కుమార్ ,అనిత,సుష్మ ప్రియాంక,పీఈటి వెంకట్రాములు,ఈరన్న  అరుణరాణి తదితరులు పాల్గొన్నారు.