అమీనాపురంలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ

 

కేసముద్రం ఆగస్టు 9 జనం సాక్షి

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈనెల 8 నుంచి 22 వరకు ద్వి సప్తాహ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది.ఈ నేపథ్యంలో మండలంలోని అమీనాపురం గ్రామంలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ చంద్రమోహన్ ,ఎస్సై రమేష్ బాబు,ఎంపీడీవో రోజా రాణి లు హాజరు కాగా స్థానిక సర్పంచ్ పురం రాజమణి రమేష్ ల ఆధ్వర్యంలో ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీ జరిగింది.