‘అమ్మ’ కోసం మృత్యుంజయ యజ్ఞం


jaya-03-oct
చెన్నై: తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని కోరుతూ అన్నాడీఎంకే కార్యకర్తల నేతృత్వంలో భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆమె ఆరోగ్యం కుదుటపడి త్వరగా కోలువాలని కోరుతూ తాజాగా మృత్యుంజయ యజ్ఞాన్ని చేపట్టారు. చెన్నైలో ఏర్పాటు చేసిన ఈ యజ్ఞంలో 200 మంది పూజారులు.. మూడు వేల మంది భక్తులు పాల్గొన్నారు. మరోవైపు.. అమ్మ ఆరోగ్యం కుదుటపడుతోందని.. ఆమె ఆహారాన్ని ఆమే తీసుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి.