అయిదో రోజుకు చేరుకున్న అన్నా హజారేదీక్ష

న్యూఢిల్లీ: ఆగస్టు 2 : .జన్‌లోక్‌ పాల్‌ బిల్లు కోసం ఢిల్లీలోని జందర్‌మంతర్‌ వద్ద సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన అమరణ నిరాహారి దీక్ష గురువారం నాటికి ఐదో రోజుకు చేరింది. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న అన్నా తిరస్కరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడాయాతో మాట్లడుతూ లోక్‌ పాల్‌ బిల్లు వచ్చే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా తనకు మద్దతు వస్తోందని, అంచేత దీఓ విరమించేది లేదని అన్నా పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు హీజరేకు ఈ ఉదయం రాఖీలు కట్టారు. కాగా అన్నా దీక్ష సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.