అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలి

నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో  పాల్గొన్న గొంగళ్ళ రంజిత్ కుమార్

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి) జూలై 01 : జిల్లాలోని
ధరూర్ మండల కేంద్రంలో  తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఈరోజు నడిగడ్డ హాక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా శిబిరంలో గొంగళ్ల రంజిత్ కుమార్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ముడెకరాల భూ పంపిణీ మరియు ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ను ఇవ్వాలని, అలాగే ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వాలని కోరారు.
రాష్ట్రం ఏర్పడ్డాక  నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని ఆశపెడ్డ వారికి నిరాశే మిలిగిందని ప్రభుత్వ పథకాలలో కూడా రాజకీయాలు చేస్తున్నారని ఇప్పటికీ ఆయా గ్రామాలలో  పింఛన్లు ఇవ్వాలన్న కూడా రాజకీయాలు చేస్తున్నారని, ఒకవైపు ముఖ్యమంత్రి పింఛన్లు ఇస్తూ ఇంటికి పెద్దన్నగా వ్యవహరిస్తానని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం అర్హులైన వారందరికీ వృద్యాప, వితంతు, ఒంటరి మహిళ మరియు వికలాంగుల పింఛన్లు అందడం లేదని కావున వెంటనే అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలని అన్నారు.కేవలం ఎన్నికలప్పుడు మాత్రం ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ ఓట్లు వేయించుకునే నాయకులు ఇప్పుడు మాకు పథకాలు అందకుంటే ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు?  బడుగు బలహీన వర్గాల ప్రజలు ప్రభుత్వ పథకాలకు సైతం మీ ఇళ్ల కాడ కాపలాకాల్సిన పరిస్థితి ఎందుకని అన్నారు.ధర్నా తదనంతరం పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి వర్తింపజేయాలని మరియు ప్రతి దళితునికి మూడెకరాల భూ పంపిణీ  చేయాలని ఎమ్మార్వో కు మరియు అర్హులైన వారందరికీ పింఛన్లు వెంటనే అందజేయాలని ఎంపీడీవోకు వినతి పత్రం సమర్పించారు.ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు జిల్లా కార్యదర్శి లావణ్య మండల సమన్వయకర్తలు గోవిందు మరియు పరుశ రాముడు, మరియు మండల కమిటీ నాయకులు సుదర్శన్  రాము, జగదీష్,మునెప్ప, జమ్మన్న,మహానంది, రవి, పరుశ లతో పాటు అర్హులైన లబ్ధిదారులు మరియు మిగతా మండలాల నాయకులు ఉలేగెపల్లి తిమ్మప్ప, చిన్న రాముడు, రమేష్, ప్రేమ్ రాజ్ గోపాల్, కృష్ణ,గుండన్న రాజు,అంజి, భీమయ్యగౌడ్, పూల జమ్మన్న, రఘుపతి ఎల్లేష్  తదితరులు పాల్గొన్నారు.