అర్హులైన వారికి పట్టలివ్వాలి

బషీరాబాద్ సెప్టెంబర్ 19,(జనం సాక్షి) బషీరాబాద్ మండల కేంద్రంలో సోమవారం రోజున సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కే.శ్రీనివాస్ తహశీల్దార్ ఎన్. వెంకట్ స్వామి కీ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలి. అట్టవి భూమిని ఇష్టము వచ్చినట్లు సాగు చేసుకుంటున్నారని ఈ విషయాల పైన ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వారి పట్టాలు రద్దు చేసి అర్హులైన వారికి న్యాయం చేయాలని తహశీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కే.గోపాల్, పి.మోహన్,పి.కిషన్,గోవింద్, రమేష్,రవి,సేవ్య తదితరులు పాల్గొన్నారు.