అస్సోంలో ఉగ్రఘాతుకం, 12 మంది మృతి

అస్సోంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కోక్రాఝర్‌ లోని మార్కెట్‌ లో గ్రనేడ్‌ తో దాడి చేశారు. ఈ ఘటనలో 12 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరో 30 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులు గ్రనేడ్‌ దాడి అనంతరం కాల్పులకు దిగారు. వెంటనే స్పందించిన భద్రత బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. ప్రస్తుతం ఉగ్రవాదులకు భద్రత బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. ఉగ్రవాదులు ముగ్గురు, నలుగురు ఉండొచ్చని భద్రత అధికారులు చెబుతున్నారు