ఆందోళన విరమించిన తెదేపా సభ్యులు

హైదరాబాద్‌ : చలో అసెంబ్లీ సందర్భంగా ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తెదేపా తెలంగాణ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్‌ సభను సోమవారానికి వాయిదా వేసిన తర్వాత కూడా ఆందోళన కొనసాగించారు. ముఖ్యమంత్రి, స్పీకర్‌ అసెంబ్లీ నుంచి వెళ్లిన తర్వాత తెదేపా సభ్యులు ఆందోళనను విరమించారు.