ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని పరామర్శించిన మాచుపల్లి సర్పంచ్.

కోడేరు (జనంసాక్షి) ఆగస్టు 20 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని మాచుపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట కురుమయ్య భార్యాభర్తల గొడవతో మామ మందలించినాడని మనస్థాపనతో గుళికలు తాగి ఆత్మహత్యాయత్నం కు పాల్పడిన అతనిని వెంబడే వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేస్తున్నారు, ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని డాక్టర్లు వివరించారు, అతన్ని పరామర్శించిన మాచుపల్లి సర్పంచ్ పూర్ణచంద్రారెడ్డి, ఎంపీటీసీ లావణ్య లక్ష్మయ్య, రైతు సమన్వయ సమితి గ్రామ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బాలస్వామి టిఆర్ఎస్ నాయకులు నరసింహ పరామర్శించిన వారిలో ఉన్నారు.