ఆదిభట్ల మున్సిపాలిటీలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):- ఆదిభట్ల మున్సిపాలిటీలో బొంగులూరు ఎక్స్ రోడ్ యందు ఆదిభట్ల మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు శిగ వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో  పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి నాయకులు ఈ కార్యక్రమానికి ద్వేషించి రంగారెడ్డి జిల్లా కార్యదర్శి, ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి ఫ్లోర్ లీడర్ పొట్టి రాములు మాట్లాడుతూఏకాత్మ మానవవాదం ప్రవచించి
సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాల్లో తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ విధానాన్ని రూపొందించి..ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బిజెపి కి పటిష్ట పునాదులు వేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయ సాధన కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిస్తూ రాబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో  బిజెపి విజయంక మోగిస్తుందని ఆశిస్తున్నాను అదేవిధంగా కొంగరకలాన్ లో 5వ వార్డులో ముద్దం భరత్ గౌడ్, 14వ వార్డులో పండల హరిశంకర్ గౌడ్, 7వ వార్డులో పేపర్ల రాజు, 8వ వార్డులో రామగళ్ళ నరసింహ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గీత సెల్ కన్వీనర్ పండల లక్ష్మీపతి గౌడ్, మీడియా కన్వీనర్ ఉడుతల అశోక్ గౌడ్, కార్యవర్గ సభ్యులు దండిగా తిరుమలేష్ యాదవ్, రంగారెడ్డి జిల్లా కోశాధికారి ఆదిమూల మహేష్ చారి, ఆదిభట్ల మున్సిపాలిటీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీదేవి, ఆదిభట్ల మున్సిపాలిటీ దళిత మోర్చా అధ్యక్షులు లింగాల వసంత్ కుమార్, ఉపాధ్యక్షులు రామగళ్ళ నరసింహ, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి రావుల మహేష్, రవీందర్ గౌడ్, యాదయ్య గౌడ్, పవన్ గౌడ్, ఐలయ్య, మహేష్, రాములు, సునీత, పద్మ, సంతోష, శైలజ తదితరులు పాల్గొన్నారు
Attachments area