ఆధార్‌ జోడింపుతో సత్ఫలితాలు

ఉపాధి కూలీలకు భద్రత పెరిగిందంటున్న అధికారులు

న్యూఢిల్లీ,జూన్‌9(జనం సాక్షి ): గ్రావిూణ ప్రాంతాల్లో ఉపాధి హావిూ పథకం అవకతవకలను నిరోధించేందుకు నేరుగా లబ్దిదారులకు చెల్లింపులు జరిగేలా ఆధార్‌తో అనుసంధానం చేయడంతో సల్ఫలిలాలు వస్తున్నాయని భావిస్తున్నారు. సామాజిక భద్రత కింద లభించే ప్రయోజనాలు పొందాలంటే ఇది తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఇది సత్ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ పథకం కింద ఏడాదికి 100 పనిదినాలను కల్పించాల్సి ఉంది. దీనికోసం లబ్ధిదారులు తమ పేర్లను ముందుగా నమోదుచేయించుకుని జాబ్‌కార్డు పొందాలి. ఆధార్‌ సంఖ్య లేనివారు అది పొందేవరకూ తమ రేషన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్సు, ఓటరు గుర్తింపుకార్డు, కిసాన్‌ పాస్‌పుస్తకం, గజిటెడ్‌ అధికారి ఇచ్చిన ధ్రువీకరణ పత్రం లేదా ఉపాధి హావిూ జాబు కార్డులలో ఏదో ఒక దానిని తమ గుర్తింపు పత్రంగా చూపించి ఉపాధి హావిూ పథకం ద్వారా లభించే ప్రయోజనాలను పొందవచ్చని అధికారులు తెలిపారు. కింద పనులు పొందాలంటే ఆ పథకం లబ్ధిదారులు ఆధార్‌ సంఖ్యను కలిగిఉండాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. ఆధార్‌కార్డుకు దరఖాస్తుచేసుకున్నా అది రానివారు నమోదు పత్రాన్ని అయినా సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. మరోవైపు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్‌ఓ కూడా తన పింఛనుదారులు తమ ఆధార్‌ సంఖ్యను లేదా ఆధార్‌ నమోదుకు చేసుకున్నామన్న ధ్రువపత్రానైనా సంస్థకు తెలియజేయాలని పేర్కొంది.