ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయ నిధి వరం లాంటిది- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయ నిధి వరం లాంటిది- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్*
*దిశ శంషాబాద్* : ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయ నిధి వరం లాంటిదని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీకి చెందిన 9 మందికి.శంషాబాద్ మండలానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు  శంషాబాద్ మున్సిపల్ వైస్ చైర్మెన్ బండి గోపాల్ యాదవ్ తో కలిసి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంగళవారం మైలార్దేవ్పల్లి లోని ఎమ్మెల్యే నివాసంలో చెక్కును ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఉండేదని అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏ ఒక్కరికి సమయానికి అందలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆపదలో ఉన్నవారిని కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పథకానికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సహకారంతో చెక్కును అందజేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మెన్ దూడల వెంకటేష్ గౌడ్, సర్పంచులు రమేష్, దేవా నాయక్,ఉప సర్పంచ్ జగన్మోహన్ రెడ్డి, నాయకులు దిద్యాల శ్రీనివాస్, మోహన్ రావు,రాజేందర్, రమేష్, అశోక్, నరసింహ, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.