ఆప్‌లో నేతలపై 28న చర్చ

న్యూఢిల్లీ,మార్చి9(జ‌నంసాక్షి): ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి ఉద్వాసనకు గురైన పార్టీ సీనియర్‌ నేతలు యోగేంద్రయాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌ ల తొలగింపు అంశంపై జాతీయ కార్యవర్గ సమావేశంలో చర్చించనున్నట్టు ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. గత కొన్ని రోజులుగా ఆప్‌ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో రాజకీయ వ్యవహారాల కమిటీ నుంచి యోగేంద్రయాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లను పార్టీ అగ్రనాయకత్వం తొలగించిన విషయం తెలిసిందే. ఈ నెల 28 ఆప్‌ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో అధికార కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అప్పటికి సిఎం కేజ్రీవాల్‌ చికిత్స ముగించుకుని ఢిల్లీ చేరుకోనున్నారు.