ఆప్ మహారాష్ర్ట కన్వీనర్ రాజీనామా

ఆమ్ ఆద్మీ పార్టీ మహారాష్ర్ట కన్వీనర్ అంజలి దమానియా, కార్యదర్శి ప్రీతి శర్మ తమ పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత జీవితాలకు ప్రాధాన్యం ఇవ్వడం కోసమే తాము పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పార్టీ బాధ్యతల వల్ల ఇన్నాళ్లు తాము వ్యక్తిగత, ఉద్యోగ జీవితాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేకపోయినట్టు వారు చెప్పారు. ఆప్ సిద్ధాంతాలను నమ్మి తాము పార్టీలో చేరామని, పదవుల కోసం బేరసారాలు ఆడి పార్టీలోకి రాలేదని వారు స్పష్టం చేశారు. పదవులకు రాజీనామా చేసినా పార్టీకి తమ మద్దతు కొనసాగుతుందని అంజలి, ప్రీతి చెప్పారు.