ఆమె పేరు పెడితే మాకు అభ్యంతరం లేదు : కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ : మహిళలపై లైంగిక నేరాల చట్టానికి సవరణలు చేసి ఢిల్లీ ఘటనలో మృతిచెందిన యువతి పేరు పెట్టాలన్న కేంద్ర మంత్రి శశిథరూర్‌ అభిప్రాయానికి ఆమె కుటుంబసభ్యుల మద్దతు లభించింది. కఠిన చట్టాన్ని  రూపొందించి దానికి తమ కుమార్తే పేరు పెడితే తమకేమీ అభ్యంతరం లేదని మృతురాలి తండ్రి, సోదరులు ఈరోజు ఢిల్లీలో ప్రకటించారు. ఆ చర్య ధైర్యంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన తమ బిడ్డకు గౌరవమే అవుతుందని వారు భావిస్తున్నారు. అందుకోసం ఆమె పేరును బహిర్గత పరచడానికి తమ కేమీ అభ్యంతరం లేదన్నారు.