ఆరు గ్యారెంటీ ల పై వడ్డెర కాలనీ ప్రజలకు అవగాహన

ఆరు గ్యారెంటీ ల పై వడ్డెర కాలనీ ప్రజలకు అవగాహన

జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 26 : ఆరు గ్యారంటీ లతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య అన్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని నియోజకవర్గం పరిధిలోని పాలకుర్తి మండలం జిడి నగర్ జిపి వడ్డెర కాలనీలో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల గురించి గురువారం స్థానిక కాంగ్రెస్ నాయకుల తో కలిసి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని, కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన ఆ పథకాల గ్యారెంటీ కార్డులపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంథని ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి దుద్దిల్ల శ్రీధర్ బాబును భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దారంగుల రాజేశం,రాజు,అశోక్,సంపత్, మరియు గ్రామ ప్రజలు,మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.