*ఆర్ఎస్ఎస్ ఏబివిపి ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు*

పెద్దేముల్ ఆగస్టు 10 (జనం సాక్షి)
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మరియు అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ పెద్దేముల్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
,స్వామి వివేకానంద స్కూల్,
శ్రీవాణి విద్యామందిర్ పాఠశాలల్లో రక్షా బంధన్ నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…అన్న చెల్లెలు అక్క తమ్ముడు అనుబంధాలకు  ప్రతిరూపంగా రక్షా బంధన్ నిర్వహించుకుంటాము అని తెలిపారు. విద్యార్థులు వారియొక్క భావనను  అలాగే నేను దేశానికి ధర్మానికి రక్షా అనే భావనను చాటి  చెప్పడం జరిగింది. అలాగే కేంద్రం ఇచ్చిన గొప్ప అవకాశం హర్ గర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని సగర్వంగా జాతీయ జెండాను మన ఇంటి పై ఎగరేసి దేశభక్తిని జాగృతం చేద్దాం అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమములో ఆర్ఎస్ఎస్ పెద్దేముల్ ఖండ బౌద్ధిక్ ప్రముఖ్  అశోక్, ఏబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మౌనేశ్వర్ చారి,
 కార్యకర్తలు వేదం చారి, శివ కుమార్, మహేష్ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు   తదితరులు పాల్గొన్నారు.