ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ద:బొత్స

హైదరాబాద్‌:ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు రవాణాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ తెలిపారు.సమ్మె నోటీసు ఇచ్చిన గుర్తింపు కార్మిక సంఘం ఎస్‌ఎంయు కార్మిక సమస్యలపై కాకుండా ఇతర డిమాండ్లును పెట్టడం వల్లే చర్చలు సఫలం కావడం లేదని ఆయన అన్నారు.సందిగ్థాన్ని తొలగించేందుకు ఎస్‌ఎంయు కార్మిక సంఘం నేతలను చర్చలకు ఆహ్వనించినట్లు తెలిపారు.ఇప్పటికే నష్టాల వూబిలో కూరుకుపోయిన ఆర్టీసీలో మళ్లీ సమ్మెమొదలయితే సంస్థ మనుగడకు ప్రమాదమన్న బొత్స తర్వాతి పరిణామాలకు బాద్యత వహించాల్సి వస్తుందన్న విషయాన్ని ఎస్‌ఎంయు నేతలు తెలుసుకోవాలన్నారు.