ఆర్థిక అవసరాలకు ఆసరా : ఎంపీపీ కరణం అరవింద్​ రావ్​

 పరిగి రూరల్​, సెప్టెంబర్​ 20 ( జనం సాక్షి ) :
ఆర్థిక అవసరాలకు ఎవరినీ అడగకుండా తమ కాళ్లపై నిలబడేలా సీఎం కేసీఆర్​ వృద్దులు, విభిన్న ప్రతిభావంతులు, డయాలసిల్​ పేషెంట్లకు పింఛన్లు పంపిణీ చేయడం నిజంగా అధృష్టమని ఎంపీపీ కరణం అరవింద్​ రావ్​ అన్నారు. వికారాబాద్​ జిల్లా పరిగి మండలం నజీరాబాద్ తండాలో మంగళవారం లబ్దిదారులకు పింఛన్ ప్రొసిడింగ్​ ప్రతాలు, కార్డులను  పంపిణీ చేశారు. ఈ సంద్బంగా ఎంపీపీ కరణం అరవింద్​ రావ్​, ఏఎంసీ చైర్మన్​ అంతిగారి సురేందర్​ కుమార్​ మాట్లాడుతూ మాట్లాడుతూ
వయస్సు మీదపడగాను చాలా మంది తల్లిదండ్రులను వదిలిపెట్టడం, అనాద ఆశ్రయాలకు తరలించడం చేస్తున్నారన్నరు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక పింఛన్​ డబ్బులు 2 వేలకు పై చిలుకు చేయడంతో ఆ డబ్బుల ఆశకైనా తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్​ఎస్​ మండల పార్టీ అధ్యక్షులు రొయ్యల ఆంజనేయులు, పీఏసీఎస్​ వైస్​ చైర్మన్​ శివన్నోళ్ల భాస్కర్​, సర్పంచులు గణేష్​, వెంకట్​ రామ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీబాయి లబ్దిదారులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్​ :
20 పిఆర్​ జి 01లో నజీరాబాద్​ తండాలో పింఛన్​ కార్డులను అందజేస్తున్న ఎంపీపీ, సర్పంచ్​ తదితరులు