ఆర్థిక సమస్యలతో వ్యక్తి ఆత్మహత్య

మునగాల, సెప్టెంబర్ 21(జనంసాక్షి): ఆర్థిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని రేపాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. రేపాల గ్రామానికి చెందిన సోమపంగు వెంకటేశ్వర్లు(56) గత కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతనికున్న సమస్యలకు పరిష్కారం దొరకకపోవడంతో తనపై తనకు విరక్తి చెంది తమ సొంత వ్యవసాయ పొలం వద్ద ఉన్న వేప చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడని, అదే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు అతని పొలం నుండి ముందుకు వెళ్తుండగా అతను క్రిందపడి ఉండడం చూశారు. వెంటనే వెంకటేశ్వర్లు భార్య సోమపంగు అలివేలుకు సమాచారం అందించారు. ఆమె తన భర్త మరణించడం చూసి కన్నీరు మున్నీరై విలపించింది. అలివేలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారని మునగాల ఎస్ఐ బాలు నాయక్ తెలిపారు. మృతుడు వెంకటేశ్వర్లకు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు కలరు.