ఆర్యవైశ్యుల ఇండ్లల్లో – ఇంటింట వాసవి మాత పారాయణము.

వాసవి క్లబ్స్ అధ్యక్షులు కండె సుద సాయిశంకర్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు23(జనంసాక్షి):
ఈనెల 24 బుధవారం నుండి నాగర్ కర్నూల్ పట్టణములోని శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం లో  ఇంటింట వాసవి మాత పారాయణము ప్రారంభం అవుతుందని, ఆ తదుపరి రోజు నుండి  స్థానిక  ఆర్యవైశ్యుల ఇళ్ళల్లో  ప్రతి రోజు ఇంటింట వాసవి మాత పారాయణము మరియు ఒక అధ్యాయము భగవద్గీత పారాయణము  నిరంతరం కొనసాగుతుందని నాగర్ కర్నూల్ వాసవి క్లబ్స్ అధ్యక్షులు కండె సుద సాయిశంకర్ గారు ఒక ప్రకటన లో తెలిపారు.ఈనెల 24 బుదవారం  సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారి గుడిలో వాసవి మాత పారా యణము తో పాటు బొమ్మల కొలువు మరియు స్నేహితుల దినోత్సవము,పల్లకీ సేవ మొదలైన కార్యక్రమాలు వుంటాయని తెలిపారు.25 గురువారం నుండి ఇంటింట వాసవి మాత పారాయణము నిరంతరం కొనసాగేలా స్థానిక ఆర్యవైశ్య మహిళా మణులు తమ పేర్లు నమోదు చేసుకో వలసిందిగా మరియు ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవము మరియు ఆర్యవైశ్యుల కులదేవత శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని వారు పిలుపునిచ్చారు.